SKLM: న్యూ కాలనీకి చెందిన బారటం వెంకటరమణమ్మ(84) ఆదివారం ఉదయం మృతి చెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహన్రావుకు తెలిపారు. దాంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత ద్వారా ఆమె కార్నియాలు సేకరించారు.