కోనసీమ: రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మెన్ MLC మండపేట నియోజకవర్గ YCP ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇవాళ కోటి సంతకాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ ఆరంభం కానుంది. వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.