కృష్ణా: పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ వినియోగం మరింతగా పెరగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోలార్ విద్యుత్ 400వ కనెక్షన్ పొందిన లబ్ధిదారుకు సబ్సిడీ మంజూరు ధృవీకరణ పత్రం అందజేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఈ వీవీ చిరంజీవి కలిసి బొప్పన శేషారావుకు రూ.78 వేల సబ్సిడీ పత్రం అందించారు.