NTR: శ్రీవారి పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గొల్లపూడి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ డిక్షనరీలో నిజాయితీ, చిత్తశుద్ధి అనే పదాలు ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడేవాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నాడని అన్నారు.