PLD: పిడుగురాళ్ల పట్టణంలోని మన్యం పుల్లారెడ్డి ZP హై స్కూల్లో బుధవారం వసుదైక కుటుంబం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై, నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు తమ చదువుకున్న పాఠశాలకు సాయం అందించారు.