కృష్ణా: బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రాష్ట్ర వాటా కింద కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి 3.25 లక్షల మంది విద్యార్థులను జగన్ దగా చేశాడని టీడీపీ నేత బెజవాడ నజీర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేతనాల బకాయిలు మొత్తం రూ.254.48 కోట్లు విడుదల చేసేందుకు కూటమి నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.