VSP: అరకులోయ మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిధిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో 40 మంది విద్యార్థులకు నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని గిరిజనులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.