SKLM: వజ్రపుకొత్తూరు మండలం పలాస నియోజకవర్గ పరిధిలోని గ్రిగ్స్ మీటను ఈనెల 30, 31న గోవిందపురం ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు కె.హరిబాబు, వ్యాయామోపాధ్యా యుడు నాగరాజు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల అనుమతి తప్పనిసరి అన్నారు.