కృష్ణా: గుడివాడలో దశాబ్దాలుగా సమస్యాత్మకంగా అనాధీనం, సొసైటీలు, కండిషన్ పట్టాల భూ సమస్యలను పరిష్కరించడంపై ఎమ్మెల్యే రాము దృష్టి పెట్టారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల తాహసీల్దార్లతో ప్రజా వేదిక కార్యాలయంలో ఆయన శనివారం సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.