KKD: గణపతి నవరాత్రుల ముగింపు పురస్కరించుకుని గణేష్ ఉత్సవ కమిటీ నాయకులతో బుధవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యలు పలు సూచనలను చేశారు.