KRNL: టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కుటుంబ సమేతంగా గురువారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జ్యోతికి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.