W.G: ‘మొంథా’ తుఫాను నేపథ్యంలో తణుకులోని ప్రజలకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. 08819 224056, 94910 4147 నంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంగళవారం తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు తీవ్రస్థాయిలో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.