ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ భవన్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబుని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు వెనుకబడిన ప్రాంతం అని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు.