VZM: ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం పోతంపేట, లచ్చంపేట, నరసన్నపేటలో సోమవారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరిస్తున్నామని అన్నారు.