E.G: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి, యనమల రామకృష్ణుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మేధా సంపన్నుడు, విద్య, పరిపాలనను సమానంగా విస్తరించిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు. ఆర్థిక మేధోసంపత్తితో గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వైపు నడిపించారని యనమల పేర్కొన్నారు.