W.G: జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో మొంథా తుపాన్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఐరన్ రేకులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు.