KRNL: నగర ప్రజలు తెలుపుతున్న సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశిత గడువులోపు అర్జీలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి తొలిసారి 54 ఫిర్యాదులు స్వీకరించారు.