ASR: మన్యం జిల్లా మక్కువ మండల విలేకరిపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఏపీటీఆర్ఏ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు శెట్టి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టిన జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదని తీవ్రంగా ఖండించారు. తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.