కృష్ణా: పోరంకిలో శనివారం జరుగుతున్న ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొని మాట్లాడారు. కృష్ణంరాజు నటించిన ‘భక్తకన్నప్ప’ను మేకర్స్ తొలుత ఎన్టీఆర్కు చూపించారన్నారు. బిజీ షెడ్యూల్లో సైతం ఆ సినిమాను చూసిన ఎన్టీఆర్ ఎంతగానో ప్రశంసించారన్నారు. కృష్ణంరాజు సోదరులకు, ఎన్టీఆర్తో అవినాభావ సంబంధం ఉండేదన్నారు.