KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని రంగ మండపంలో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులకు TTD వేద పండితులు, అర్చకులు అభిషేకాలు చేశారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం జరిపించారు. కళ్యాణోత్సవం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.