KDP: కలసపాడు మండలంలో నూతన ఎస్సైగా నియమితులైన ఘనా మద్దిలేటిని మంగళవారం మండల టీడీపీ నాయకుడు బాలిరెడ్డి మర్యాదపూర్వకంగా కలశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.