VSP: బురుజుపేటలో వేంచిసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిరమాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే దర్శనానికి వచ్చే భక్తుల తమకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలిపారు. రూ.500, రూ.200, రూ.100, ఫ్రీ దర్శనం ఒకే చోట కలపడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు చెప్పగా.. ఎగ్జిట్ దారి మార్చడం వలన సీనియర్ సిటజన్స్ అవస్థలు పడుతున్నారని పలువురు వాపోతున్నారు.