W.G: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం పార్టీ టౌన్ కార్యదర్శి వాసుదేవరావు డిమాండ్ చేశారు. భీమవరంలోని సీపీఎం కార్యాలయంలో రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా పేదవాడి సొంతింటి కల నెరవేర్చటం లేదన్నారు.