ATP: అనంతపురం త్రీటౌన్ పోలీసులు భూ కబ్జాదారులపై కొరడా ఝులిపించారు. CI శాంతిలాల్ వివరాల మేరకు.. విద్యారణ్య నగర్లో విజయకృష్ణకు చెందిన భూమిని కొంత మంది వ్యక్తులు ప్రజా సంఘం ముసుగులో ఆక్రమించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై భూకబ్జా కేసులు నమోదు చేశామన్నారు. భూకబ్జాలపై ఏమాత్రం సహించమని అవసరమైతే PD యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.