VZM: సంతకవిటి మండలం తాలాడలో ఉమారామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.