అన్నయ్య: కోడూరు మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కోడి పందేల బరిపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదివారం కోడూరు ఎస్సై చాణిక్య రాబడిన సమాచారం ప్రకారం తమ సిబ్బంది తో కలిపి కోడి పందేల బరిపై దాడి చేసి పది మంది వ్యక్తులను, 17 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న రూ 13,980/- నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేశారు.