కృష్ణా: అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సై శ్రీనివాస్ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డయల్ 112 అత్యవసర సేవలు, ట్రాఫిక్ నియమాలు, గంజాయి, తదితర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.