E.G: ‘సంసాద్ ఖేల్’ మహోత్సవంలో భాగంగా మంగళవారం సీతానగరం హై స్కూల్ నందు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ముందుగా క్రీడా ప్రాంగణంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, పోటీలను ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సంసాద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నారన్నారు.