నంద్యాల: బేతంచెర్ల సమాజంలోని యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ డీ.వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం బేతంచెర్లలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై సీఐ అవగాహన కల్పించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే 100కు ఫోన్ చేయాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యంతో చదివి ఎదగాలన్నారు.