VZM: మొంథా తుఫాన్ కారణంగా పొంచి ఉన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురకాకుండా ఉండేందుకు తాసీల్దార్ శ్రీనివాసరావు తదితర శాఖల అధికారులు సోమవారం పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. ఎస్ కోట మండలం మూలబొడ్డవర, ముసిడిపల్లి, భర్తా పురం ఎస్టీ కాలనీ, పోతనపల్లిలో పునరావాస కేంద్రాలను ప్రారంభించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు.