కడప: నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఎసీఎఫ్ రెజ్లింగ్ క్రీడా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి అరుణ కుమారి తెలియజేశారు. రెజ్లింగ్ అండర్ 14, అండర్ 17 బాల బాలికలు విభాగంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడప డీఎస్ఏ మైదానం ప్రాంగణంలో బాస్కెట్ బాల్ అండర్ 14,17 విభాగాలలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు.