VZM: రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణకు గురైన చెరువును సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, ఎస్.గోపాలం అదివారం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చుస్తుందన్నారు. చెరువు ఆక్రమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.