ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో ఎన్నికల అధికారిణి జే.కళావతి ఆధ్వర్యంలో సోమవారం పెసా కమిటీ ఎన్నిక నిర్వహించారు. తామర్ల సూర్య నారాయణ పెసా కమిటీ ఉపాధ్యక్షుడుగా, చెడ్డా రామ్మూర్తి పెసా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారిణి జే.కళావతి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.