CTR: మైనర్ను తీసుకెళ్లిన వ్యక్తిపై ఫొక్సొ కేసు నమోదు చేసినట్లు SI రవి కుమార్ తెలిపారు. పీటీఎం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటినుంచి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబీకులు తెలిసిన చోటల్లా వెతికారు. ఆ బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా.. నరసింహులు ఆమెను తీసుకెళ్లినట్లు తేలింది.