కృష్ణా: నూజివీడు పట్టణంలోని సబ్ జైలును కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎస్.అరుణ సారిక శనివారం పరిశీలించారు. జైలులో ఖైదీలకు అందిస్తున్న వసతి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ, ఖైదీలకు అందించే ఆహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.