కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే మచ్చపట్ల ధర్మరాజు ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్ర పటాన్ని ఈఓ కిషోర్ కుమార్ అందజేశారు.