AKP: నర్సీపట్నం మండలం గబ్బడ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న పెట్ల చంద్రమౌళి రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో చంద్రమౌళి పాల్గొంటాడని పీడీ నాగేశ్వరరావు తెలిపారు.