KDP: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బద్వేల్ సీఐ రాజగోపాల్ అన్నారు. శనివారం బద్వేలులోని రాచపూడి డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణ – పక్షోత్సవాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరం సీఐ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.