VZM: వేపాడ మండలం కొంపల్లి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి బాల భాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో చతుర్విధ ప్రక్రియలు చేయించి వారి అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించాలని కోరారు.