WG: ప్రభుత్వ అనుమతులు లేకుండా మందు గుండు సామాగ్రి తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో మందు గుండు సామాగ్రి తయారు చేసే యూనిట్లను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.