PLD: చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే, వయసు హోదా అడ్డు రాదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు నిరూపించారు. కాగా ఆయన తాజాగా పట్టభద్రుడు అయ్యారు. చదువు మధ్యలో ఆపేసిన ఆయన ఇటీవల బీఏ( సోషల్ సైన్స్)డిగ్రీ పూర్తి చేశారు. పార్ట్-1, పార్ట్-2లో రెండింట్లోనూ ప్రథమ శ్రేణి సాధించారు. తన కోరిక నెరవేరిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.