నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండల వైఎస్సార్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళితో పాటు 8 మంది కౌన్సిలర్లు టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, అబ్దుల్ అజిజ్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.