విజయనగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలపాలని శ్రేణులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. శనివారం విజయనగరం నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు.