ప.గో: కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలిపారు.