GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బదిలీ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిన్న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుంటూరులో చేసిన సేవలు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. అధికారుల సమన్వయం, ప్రజల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని తెలిపారు.