NLR: విద్యార్థులు పాఠశాలల్లోనే తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం భుజించాలని ఎంఈఓ రమేష్ కుమార్ తెలిపారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం, పిడూరుపాలెం గ్రామాల్లోని ఎలిమెంటరీ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. విద్యార్థులు అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తినేలా చర్యలు తీసుకోవాలన్నారు.