PLD: క్రోసూరులోని ఇరిగేషన్ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి. వందల ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ.. కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మౌనం వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక నేతల అండతో ఈ దందా నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.