యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. మంగళవారం సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, కల్యాణకట్ట, యాదరుషి నిలయం, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ. 16,49,308 ఆదాయం వచ్చింది.