»Shubman Gill Century Miss Sara Tendulkar Reaction Goes Viral
Shubman Gill: సెంచరీ మిస్..సారా టెండూల్కర్ రియాక్షన్ వైరల్
నేడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 33వ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు మిస్సయ్యాయి. అయితే ముందుగా శుభ్మాన్ గిల్ తన ఏడో వన్డే సెంచరీ చేసేందుకు ముందు 92 రన్స్ వద్ద ఔట్ కాగా..సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
Shubman Gill century miss Sara Tendulkar reaction goes viral
గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లో టీమిండియా స్టార్ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ తన ఏడో వన్డే సెంచరీకి చాలా దగ్గరగా ఉన్న క్రమంలో అతను అకస్మాత్తుగా 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ఆ క్రమంలో 92 బంతుల్లో 92 పరుగులు చేసి శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఆ నేపథ్యంలో శుభమాన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
అయితే శుభ్మాన్ గిల్ ఔట్ అయిన వెంటనే.. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్(Sara Tendulkar) రియాక్ట్ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభ్మన్ గిల్ అవుట్ అయినప్పుడు సారా టెండూల్కర్ నిరాశ చెందింది. ఓ షట్ అన్నట్లుగా ముఖంపై చేతులు పెట్టుకుని రియాక్ట్ అయ్యింది. ఆ తర్వాత సారా టెండూల్కర్ తన సీటు నుంచి లేచి నిలబడి శుభ్మాన్ గిల్కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ క్రమంలో సారా టెండూల్కర్ చర్యలు అక్కడి కెమెరాలో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. అయితే గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రియాక్షన్స్ ప్రస్తుతం వెరల్ అవుతున్నాయి.
శుభ్మన్ గిల్ ఇప్పటివరకు భారతదేశం తరపున 40 వన్డే మ్యాచ్లు ఆడగా..అందులో అతను 62.15 సగటుతో 2113 పరుగులు సాధించాడు. భారత్ తరఫున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో శుభమాన్ గిల్ ఇప్పటివరకు 6 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్ అత్యుత్తమ స్కోరు 208 పరుగులు. ప్రపంచ కప్ 2023లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా ఇప్పుడు 12 పాయింట్లను సంపాదించింది. 2023 ప్రపంచకప్లో సెమీ-ఫైనల్కు చేరుకోవడానికి ఇప్పుడు టీమ్ ఇండియాకు కేవలం ఒక విజయం మాత్రమే అవసరం. ఈరోజు శ్రీలంక(srilanka)తో జరిగే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే నేరుగా సెమీఫైనల్కు చేరుతుంది.