TG: ముస్లిం సోదర సోదరీమణులకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఖురాన్ మనిషిని సన్మార్గంలో నడిపిస్తూ.. మానవత్వం, కరుణకు గొప్ప మార్గదర్శకంగా నిలిచింది’ అని గవర్నర్ కొనియాడారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శాంతి, సౌభాతృత్వాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.